గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 39,741 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. ఇక నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,914 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పడిపోవడం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 250 పాయింట్లకుపైగా పడిపోయింది. అయితే చివరకు రికవరీ అయ్యింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లకు పైగా నష్టపోయింది.