టాప్ టెన్ లో స్థానాన్ని కోల్పోయిన యస్ బ్యాంక్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 02:40 PM

టాప్ టెన్ లో స్థానాన్ని కోల్పోయిన యస్ బ్యాంక్

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి యస్ బ్యాంక్ తాజాగా దేశీయంగా 10 అత్యంత విలువైన రుణదాతల్లో తన స్థానాన్ని కోల్పోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు రూ.6.61 లక్షల కోట్లతో టాప్ 10 జాబితాలో ముందుండగా, ఎస్‌బిఐ రూ.3.05 లక్షల కోట్లతో మార్కెట్ విలువ రెండవ స్థానానికి పడిపోయింది. కోటక్ మహీంద్రా రూ.2.84 లక్షల కోట్లతో మూడో స్థానంలో, ఐసిఐసిఐ బ్యాంక్ రూ.2.69 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ (రూ.2.14 లక్షల కోట్లు) ఇండస్‌ఇండ్ బ్యాంక్ (రూ.87,540 కోట్లు) బంధన్ బ్యాంక్ (రూ. 64,808 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బ్యాంకు (రూ.40,420కోట్లు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 34,093 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలిచాయి.





Untitled Document
Advertisements