బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త మీటూ కేసు ఎంత దుమారం రేపిందో తెలిసిందే. తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన తరువాత ఇండియాలో మీటూ ఉద్యమం ఊపందుకుంది. ఎందరో ప్రముఖులపై పలువురు నటీమలు ఆరోపణలు గుప్పించారు. దీంతో మీటూ వ్యవహారం వేడెక్కింది. టాలీవుడ్కు కూడా ఈ ఉద్యమం వ్యాపించచింది.
తనుశ్రీ కేసులో నానా పటేకర్ స్పందిస్తూ.. ఆమె కావాలనే నిందలు వేస్తోందని అన్నారు. దీంతో వివాదం ముదిరి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తనుశ్రీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కాబట్టి కేసు క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. దీనిపై మండిపడిన ఆమె పోలీసులు అమ్ముడుపోయారని, కోర్టుకు వెళతామని అన్నారు.