మెక్సికో: ఆరిజోనా-మెక్సికో సరిహద్దులో భారత్ కు చెందిన ఏడేళ్ల బాలిక మృతి చెందింది. నలుగురు భారతీయులతో కలిసి బాలిక అమెరికాకు అక్రమంగా వలస వెళ్తున్నట్టు సమాచారం. అయితే, వీరిలో ఇద్దరిని బొర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్స్ టస్కన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేసి చంపారు. మరో ఇద్దరు మెక్సికోకు తిరిగి వెళ్లినట్టు ఏజెంట్స్ గుర్తించారు. పారిపోయిన వారి కోసం భూ, వాయు మార్గంలో తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.