ఏంటీ.....నితిన్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 17 ఏళ్లు అయ్యిందా?

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 04:13 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొద్దీ కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు .. అందుకే ఒకింత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 'భీష్మ'గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో నితిన్ సరసన మసాలా భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఫ్లాప్ లు ఎక్కువగా ఉన్న నితిన్ కెరీర్ 'జయం' సినిమాతో మొదలైంది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ లభించింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యూత్ కి ఒక మంచి మేస్మేరైజింగ్ మ్యూజిక్ గా గుర్తుండిపోయిన చిత్రం.

అయితే, ఈ సినిమా రిలీజ్ అయి 17 సంవత్సరాలు పూర్తి కావోస్తున్నా నేపథ్యంలో హీరో నితిన్ ట్విట్టర్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నాడు .. ఈ మూవీ డైరెక్ట్ చేసిన తేజ కి నితిన్ కృతజ్ఞతలు తెలిపాడు . అలాగే ఈ సినిమా తన మనసుకి నచ్చినదిగా నితిన్ చెప్పుకొచ్చాడు. 17 ఏళ్ళ క్రితం వచ్చిన జయం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సంపాందించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న నితిన్ ఇంకా "టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్" లిస్టులో ముందే ఉంటాడు. కాగా మరిన్ని మంచి సినిమాలు నితిన్ తీయాలని ఆశిద్దాం ....!!





Untitled Document
Advertisements