ఎప్పుడో మహర్షి సినిమా విడుదలైన తర్వాత ప్రమోషన్స్ కాస్త గట్టిగా కానిచ్చి ఫారెన్ టూర్ వెళ్లాడు మహేష్ బాబు. ఇక అయన ఇప్పట్లో ఇండియాకు వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికీ ఫ్యామిలీతో కలిసి లండన్ వీధుల్లో విహరిస్తున్నాడు. ఆ మధ్య ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా చూసిన ఈయన ఆ తర్వాత వెంటనే ఇండియాకు వస్తాడని అనుకున్నారు. కానీ ఇంకా అక్కడే ఎక్కడో తిరుగుతున్నాడు మహేష్ బాబు. మహర్షి లాంటి హిట్ సినిమా ఇచ్చాడని దర్శకుడు వంశీ పైడిపల్లిని కూడా తనతో పాటే వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు సూపర్ స్టార్. త్వరలోనే ఈయన ఇండియాకు రానున్నాడు. జులై 1 అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సరిలేరు నీకెవ్వరు రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ సినిమా సెట్స్ పైకి వచ్చే నాటికి మహేష్ బాబు ఇండియాకు రానున్నాడు. వచ్చీ రాగానే సినిమాలో బిజీ కానున్నాడు. ఇప్పటికే చాలా దేశాలు చుట్టేసిన సూపర్ స్టార్ ప్రస్తుతం రీజెంట్ వీధిలో ఫోటో దిగి ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. మహర్షి సినిమాతో మహేష్ మంచి కిక్ లో ఉన్నాడు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా ఉండటంతో అప్పటి దాకా సెలవలు దొరకవు అనుకున్నాడో ఏమో కానీ అన్నీ సెలవులు ఇప్పుడే తీసుకుంటున్నాడు మహేష్ బాబు.