ప్రపంచకప్ సిరీస్ లో మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడి టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన గ్లౌజ్పై పెద్ద వివాదం జరిగింది. ఈ వివాదంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించాడు. కపిల్ మాట్లాడుతూ....''ధోని చేసిన పనికి నేను అతన్ని అభినందిస్తున్న. అతడు ఏం తప్పు చేయలేదు. కేవలం తనకు దేశం పట్ల, ఆర్మీ ప్రజల పట్ల ఉన్న గౌరవం, ప్రేమ వల్లే అలా చేశాడు. అంతకుమించి ఇందులో వివాదంగా చూసే కోణం ఏం లేదు'' అని స్పష్టం చేశారు. అయితే ఆ మ్యాచ్ లో ధోని... ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న గ్లౌజ్లు ధరించాడు. ఆ కీపింగ్ గ్లౌజ్లపై మన దేశ పారామిలిటరీ దళాలకు చెందిన బలిదాన్ బ్యాడ్జి గుర్తు ఉంది. 2011లో మన ప్రభుత్వం ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగ్రాలోని ఆర్మీ క్యాంపులో ధోని శిక్షణ కూడా తీసుకున్నాడు. శిక్షణ సమయంలో అయిదు ప్యారాచూట్ జంప్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే బలిదాన్ బ్యాడ్జ్ ఉన్న గ్లౌజ్లు ధరించిన ధోనీకి.. ట్విట్టర్లో అభిమానలు సెల్యూట్ చేశారు.