ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు గుండెలు చిక్కబట్టుకుని ఎదురు చూస్తున్న భారత్, పాక్ పోరు మాంచెస్టర్ మైదానంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇంతలో అభిమానుల ఆశల మీద నీళ్లు జల్లింది అకాల వర్షం. ఇరు జట్లూ పోటీకి అమీతుమీ అనుకున్న సమయంలోనే వర్షం దెబ్బకొట్టింది. వాన కారణంగా ప్రపంచకప్లో నాలుగు మ్యాచ్లు రద్దైన నేపథ్యంలో.. నేడు జరిగే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కూడా కొనసాగుతుందా.. రద్దు అవుతుందా అనేది సస్పెన్స్గా మారింది. వరుణుడు కరుణిస్తే గానీ పోరు ప్రారంభం కాదు. దీంతో క్రికెట్ అభిమానులంతా ఆకాశానికి చేతులు చాచి వరుణా కరుణించవా అని వేడుకునే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతానికి అక్కడ వర్షం కురవట్లేదు కానీ మ్యాచ్ మధ్యలో చిరుజల్లులు పడే అవకాశముందని పలు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి