ఇక మార్కెట్ లోకి షియోమీ స్మార్ట్‌‌‌‌బల్బ్

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 04:04 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌‌‌‌ కంపెనీ షియోమీ తన ఎంఐ ఎల్‌‌‌‌ఈడీ స్మార్ట్ బల్బ్‌‌‌‌ అమ్మకాలను ప్రారంభించినట్టు సీఈఓ మనూ జైన్‌‌‌‌ తెలిపారు. కంపెనీ క్రౌడ్‌‌‌‌ ఫండింగ్‌‌‌‌ వేదిక ద్వారా దీనిని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మనదేశంలో విడుదల చేశారు. రూ.1299 ధర ఉండే ఎంఐ ఎల్‌‌‌‌ఈడీ స్మార్ట్‌‌‌‌బల్బ్‌‌‌‌ను ఫ్లిప్‌‌‌‌కార్ట్, అమెజాన్, ఎంఐ ఆన్‌‌‌‌లైన్ స్టోర్‌‌‌‌లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 10 వాట్ల సామర్థ్యం కలిగిన ఈ బల్స్‌‌‌‌ను 800 ల్యూమెన్స్ బ్రైట్‌‌‌‌నెస్‌‌‌‌ను విడుదల చేస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌‌‌‌లను సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. ఎంఐ హోమ్‌‌‌‌ యాప్‌‌‌‌ సహాయంతో దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ బల్బు ద్వారా 16 మిలియన్ల రంగుల కాంతిని వెలువరిస్తుంది. దీనిని నిత్యం ఆరు గంటల పాటు వాడితే 11 సంవత్సరాల వరకు పనిచేస్తుందని జైన్‌‌‌‌ తెలిపారు. ఫిలిప్స్‌‌‌‌, సిస్కా, విప్రో వంటి కంపెనీలు కూడా ఇండియన్‌‌‌‌ మార్కెట్లోకి స్మార్ట్‌‌‌‌బల్బులను విడుదల చేశాయి.





Untitled Document
Advertisements