మాంచెస్టర్: వరల్డ్ కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ దూకుడు ఆడుతూ 85 బంతుల్లో సెంచరీ చేశాడు. భారత జట్టు 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. రాహుల్ 57 పరుగులు చేసి రియాజ్ బౌలింగ్ లో అజమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ బౌలర్లు దారుళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అమీర్, రియాజ్ తప్ప మిగిలిన బౌలర్లంతా గాడి తప్పారు.