వరల్డ్ కప్ లో ఆసక్తికరమై పాక్-ఇండియా మ్యాచ్ జరుగుతుంది. సిటీలోని రోడ్లన్ని ఖాళీగా కనబడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ మ్యాచ్,అందులోనూ సండే కావడంతో నగరవాసులు టీవీలకు అతుక్కుపోయారు.భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 140 పరుగులు, విరాట్ కోహ్లీ 77 పరుగులు, లోకేష్ రాహుల్ 57 పరుగులు, హార్ధిక్ పాండ్యా 26 పరుగులు చేసి భారీ స్కోర్ నెలకొల్పారు.