రేణూ దేశాయ్‌ కి కోపం తెప్పించిన వార్త

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 11:07 AM

రేణూ దేశాయ్‌ కి కోపం తెప్పించిన వార్త

సీనియర్ హీరోయిన్ రేణూ దేశాయ్‌కు ఓ వార్త తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో ఎప్పుడూ లేని విధంగా ఆమె ఆగ్ర‌హానికి గుర‌య్యారు. త‌న పిల్ల‌ల‌తో క‌లిసి రేణు ఉన్న ఓ ఫోటోకు ఓ వెబ్‌సైట్ పెట్టిన శీర్షిక ఆమె కోపానికి కార‌ణం. ఆ విష‌యాన్ని ఆమె త‌న ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేశారు.

రేణు త‌న పిల్ల‌లు అకీరా, ఆద్యాల‌తో క‌లిసి ఉన్న ఫోటోను ఓ వెబ్‌సైట్ పోస్ట్ చేసి దానికి 'ప‌వ‌న్ క‌ల్యాణ్ పిల్ల‌లు, ఆయ‌న మాజీ భార్య రేణూ దేశాయ్‌' అంటూ శీర్షిక ఇచ్చింది. దానిని త‌న ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేసిన రేణు.." ఇప్పుడే ఒకరు నాకిది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా ఎప్పుడూ బాధ పెట్టకూడద`ని కామెంట్ చేశారు.





Untitled Document
Advertisements