ఆయన నన్ను బతికించారు

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 12:15 PM

గత కొన్నిరోజులుగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం బాగోలేదని, ఆపరేషన్ వికటించి విషమంగా ఉందని రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో పోసాని నేరుగా కెమెరా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. తనకు అనారోగ్యం వచ్చిన మాట నిజమేనన్న ఆయన చచ్చిపోయేంత అనారోగ్యం రాలేదని స్పష్టం చేశారు.

‘అందరికీ నమస్కారం. కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగోలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చినట్లు నా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే.. నాకు అనారోగ్యం వచ్చింది. కానీ చచ్చిపోయేంతగా కాదు. చూస్తున్నారుగా.. మీ ముందే ఉన్నాను. వచ్చింది. యశోదా ఆసుపత్రిలో చేరాను. డా.ఎన్వీరావు గారు నన్ను బతికించారు.

పరిపూర్ణవంతుడైన ఆరోగ్యవంతుడిగా చేశారు. కాబట్టి ఇకపై నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి ఆందోళన వద్దు. ఇంకో వారం, 10 రోజుల్లో సినిమా షూటింగులకు వెళ్లబోతున్నాను. తెరపై కనిపించబోతున్నాను. ఇన్నాళ్లూ నా ఆరోగ్యం గురించి కంగారు పడ్డవాళ్లకు, నేను బాగుండాలని కోరుకున్నవాళ్లకు శతధా కృతజ్ఞతలు’ అని పోసాని కృష్ణమురళీ చెప్పారు.





Untitled Document
Advertisements