ఈమధ్య కాలంలో హీరో రామ్ కి హిట్ లేకపోవడంతో మార్కెట్ బిజినెస్ బాగా పడిపోయింది. రామ్ సినిమాలపై డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆసక్తి కాదు. కానీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు మాత్రం అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకు కారణం దర్శకుడు పూరి జగన్నాథ్.
సినిమాను ఊర మాస్ అనే రీతిలో తెరకెక్కించారు పూరి. ట్రైలర్లు, పాటలు కూడా బాగుండటంతో ఈసారి పూరి హిట్ కొట్టడం ఖాయమని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు మంచి ధర చెల్లించి చిత్రాన్ని కొనేశారు. సినీ వర్గాల సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల హక్కులు 13 కోట్లకు అమ్ముడవగా, ఓవర్సీస్ హక్కులు, ఇతర రాష్ట్రాల హక్కులు, డిజిటల్ రైట్స్ ఇలా అన్నీ కలిపి మొత్తంగా 35 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. మొత్తానికి పూరి పుణ్యమా అని రామ్ ఛాన్నాళ్ల తర్వాత మంచి బిజినెస్ చూశాడు.