ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 05:33 PM

వైఎస్ఆర్‌సీపీ ముఖ్య మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో రోజాకు కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే పలు సమీకరణాల వల్ల కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో ఆమె తీవ్రంగా నిరాశ చెందారని వార్తలొచ్చాయి. ఈక్రమంలో ఆమెను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.





Untitled Document
Advertisements