‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 02:51 PM

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడు చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బన్నీ 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా మరోసారి పూజా హెగ్డే ఆడిపాడనుంది. స్వతంత్య్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని తాజాగా ఈ సినిమా టైటిల్ ను తెలుపుతూ చిన్న టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘అల‌.. వైకుంఠ‌పుర‌ములో’ అనే టైటిల్ ఫిక్స్ చేసి సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచారు.

ఇందులో బన్నీ మధ్య తరగతి యువకుడిలా కనిపించారు. మురళీ శర్మ… ‘ఏంట్రోయ్.. గ్యాప్‌ ఇచ్చావు?’ అని ప్రశ్నించగా, ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ ఎటకారంగా సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమా తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో సీనియర్ నటి ట‌బుతో పాటు సుశాంత్, నవ్ దీప్, నివేదా పెతురాజ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ 2019 సంక్రాంతికి విడుద‌ల‌ కానుంది.





Untitled Document
Advertisements