సీజన్ 7లో జైపూర్ పింక్ పాంథర్స్ తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 3325 తేడాతో పుణేరి పల్టన్ను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే జైపూర్ చెలరేగి ఆడింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కొన్ని మ్యాచులుగా పేలవమైన ఆటతో నిరాశ పరిచిన జైపూర్ ఈసారి మాత్రం దూకుడును ప్రదర్శించింది. జైపూర్ ఆటగాళ్లు సమన్వయంతో ఆడుతూ జట్టుకు అండగా నిలిచారు. స్టార్ ఆటగాడు దీపక్ హుడా తన మార్క్ ఆటతో అలరించాడు.పల్టన్ ఆటగాళ్లను హడలెత్తించిన దీపక్ ఏకంగా పది పాయింట్లను సొంతం చేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విశాల్, నితీన్, సందీప్ నాలుగేసి పాయింట్లను సాధించారు. మిగతావారు కూడా తమవంతు పాత్ర పోషించడంతో జైపూర్ ఘన విజయం సొంతం చేసుకుంది. పల్టన్ జట్టులో మంజీత్ (5) ఒక్కడే కాస్త రాణించాడు. ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు.