ప్రతి సంవత్సరం జరుపుకునే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వేడుక ఈ ఇయర్ కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాయి. ఖతర్ లో జరిగిన ఈ వేడుకల్లో సెలబ్రిటీస్ సందడి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ పరిశ్రమకు చెందిన సినిమాలకు ఇక్కడ అవార్డులు ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన సైమా అవార్డుల్లో తెలుగు సినిమాల్లో బెస్ట్ అనిపించుకున్న వారికి అవార్డులు వచ్చాయి. ఈ వేడుకకు కీర్తి సురేష్, రాధిక. శ్రీయ, పాయల్ రాజ్ పుత్, యశ్, విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు. సుమ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.
అవార్డులు అందుకున్న సినిమాలు :
ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్ భూపతి (ఆర్.ఎక్స్ 100)
ఉత్తమ నటుడు: రామ్చరణ్ (రంగస్థలం)
ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ నటుడు (క్రిటిక్): విజయ్ దేవరకొండ (గీత గోవిందం)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (మహానటి)
ఉత్తమ నటి (క్రిటిక్): సమంత (రంగస్థలం)
ఉత్తమ పరిచయ నటి: పాయల్ రాజ్పుత్ (ఆర్.ఎక్స్ 100)
ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్ (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్ (మహానటి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)
ఉత్తమ ప్రతినాయకుడు: శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్(రంగస్థలం- ఎంత సక్కగున్నావే)
ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (ఆర్.ఎక్స్ 100- పిల్లారా.. పాట)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
పాపులర్ సెలబ్రిటీ ఆన్ సోషల్మీడియా: విజయ్ దేవరకొండ