రొమాంటిక్ మూవీస్ పై ఫోకస్ పెట్టనున్న మెగా హీరో

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 12:00 PM

వరుస ప్లాపుల్లో ఉన్న మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరితో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఐతే, చిత్రలహరి తర్వాత తేజు జోరుపెంచలేదు. మారుతిదర్శకత్వంలో ప్రతిరోజు పండగ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే వరుస సినిమాలని ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఒకేసారి 2 సినిమాల్ని ఓకే చేశాడు.

వీటిలో ఒక సినిమాను కొత్త దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నాడు. సుబ్బు అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సాయి తేజ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.ఇది కూడా రొమాంటిక్ కామెడీ సినిమానే. చూస్తుంటే సాయితేజ్ కొన్నాళ్ల పాటు యాక్షన్ కథల్ని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది.





Untitled Document
Advertisements