మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మిలటరీ విధులు పూర్తిచేసుకున్నాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ పారామిలటరీ రెజిమెంట్ లో 15 రోజుల పాటు సేవలదించాడు. జులై 30 నుంచి ఆగస్టు 15దాకా కాశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలు నిర్వహించాడు. మిలిటెంట్లు ఏరివేతలో ప్రముఖ పాత్ర పోషించే విక్టర్ ఫోర్స్ లో పనిచేశాడు.