ఐసీసీ ఈ మధ్యే విడుదల చేసి టెస్టు ర్యాంకుల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. స్టీవ్స్మిత్ మూడు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకాడు. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం 9 పాయింట్ల అంతరమే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, స్టీవ్స్మిత్లో ఎవరు గొప్ప బ్యాట్స్మన్? అని చర్చ మొదలవగా...విరాట్కు స్మిత్ సరిజోడని, అతడిని మించిన ఆటగాడని కొందరు అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దీనిపై స్పందించాడు. 'అతడే (విరాట్) అత్యుత్తమం, అవును స్మిత్ కన్నా కోహ్లీయే మెరుగైన ఆటగాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వీరిద్దరినీ మీరు చూస్తే స్మిత్ కన్నా కోహ్లీ ఆట చూడముచ్చటగా ఉంటుంది. ప్రపంచంలో అతడే నంబర్ వన్ బ్యాట్స్మన్. అతడు శతకాలు బాదుతున్న తీరు చూస్తుంటే సచిన్ రికార్డులను బద్దలు చేస్తాడని కచ్చితంగా అనిపిస్తోంది. ప్రస్తుతమైతే అతడే అత్యుత్తమం. శతకాలు బాదడంలోనూ అతడే బెస్ట్. ఐతే సచిన్ సాధించిన ఒక రికార్డును మాత్రం ఎవరూ దాటకపోవచ్చు. ఆయనలా 200 టెస్టులు మరొకరు ఆడతారని అనుకోను' అని వీరూ అన్నాడు.