గత మూడు రోజులుగా నష్టాలతో సతమతమవుతున్న దేశీయ మార్కెట్లు శుక్రవారం(ఆగస్ట్23)న కాస్త కోలుకున్నాయి.ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 10,700 దిగువన ట్రేడ్ అయ్యింది. దీంతో నష్టాల నుంచి తేరుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. మొత్తంగా నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 228 పాయింట్లు ఎగబాకి 36,701 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,829 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.66గా కొనసాగుతోంది.