కోడెల మరణంపై హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేత వంగవీటి నరేంద్ర

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 02:49 PM

కోడెల మరణంపై  హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేత వంగవీటి నరేంద్ర

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నిన్న దివంగులయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంట్లో కోడెల ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు,అది గమనించిన కోడెల కుటుంబ సభ్యులు ఆయన్నుహుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ కోడెల ప్రాణాలు విడిచారు.అయితే కోడెల మరణంపై బీజేపీ నేత వంగవీటి నరేంద్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి మోహనరంగా నిరాహార దీక్షకు దిగారని అలాంటి ప్రజా నాయకుడిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడేమో కోడెలను ప్రజా నాయకుడని కొన్ని మీడియా సంస్థలు చెప్పుకుంటున్నాయి. ఇదే కోడెల, రంగా హత్య జరిగినప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు. కోడెల జిల్లా ఎస్పీ సాయంతో 3 సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చంపారు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే వంగవీటి నరేంద్ర తెలిపారు.

పోలీస్ శాఖలో వంగవీటి మోహనరంగాకు సానుకూలంగా ఉన్న 300 మందికిపైగా పోలీసులను వారం రోజులు ముందే బదిలీ చేయించారు. ఇలా కుట్రపూరితంగా రంగా చావుకు కారణమైన ముఖ్యమైనవారిలో కోడెల ఒకరు.ఈరోజు కోడెల అనే నీచుడు చనిపోయాడు. ఆయన చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు.రంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేని ప్రభుత్వం ఆయన్ను తుదముట్టించిందని వాపోయారు.

https://youtu.be/Fw00Yu711M0





Untitled Document
Advertisements