రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న సంతోష్ మెహ్రా(1987 బ్యాచ్) స్థానంలో గతంలో జైళ్లశాఖ డిజిగా పనిచేసిన (1987 బ్యాచ్) వికెసింగ్ను మంగళవారం నియమించింది. కాగా సంతోష్మెహ్రాను డిజిపి కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. అలాగే ఫైర్ సేఫ్టీ డిజి గోపికృష్ణ (1987 బ్యాచ్)స్థానంలో సంజయ్కుమార్ జైన్(1997 బ్యాచ్)రె నియమించింది. అలాగే గోపికృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిసనర్గా బదిలీ చేసింది.