రానున్న రోజుల్లో ఆకశాన్నంటనున్న పసిడి ధరలు...తులం రూ.75,000!!!

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 10:13 AM

రానున్న రోజుల్లో ఆకశాన్నంటనున్న పసిడి ధరలు...తులం రూ.75,000!!!

పండగ సీజన్ లో ఆఫర్ల కారణంగా బంగారం తెగ అమ్ముడుపోతోంది. అంతేకాదు కొనుగోలు చేసే వారికి ఇది మంచి తరుణం అని చెప్పొచ్చు. కొనుగోలు చేయాలని భావిస్తే మాత్రం కొనేయండి. ఎందుకంటారేమో రానున్న రోజుల్లో బంగారం భారీగా పెరగనుంది.బంగారం ధర (తులం) భవిష్యత్‌లో ఏకంగా రూ.75,000 స్థాయికి చేరొచ్చు. ఈ మాట అంటున్నది నేను కాదు. దేశీ దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా. ఈయన బంగారంపై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. పసిడి పరుగు ఖాయం అంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వస్తున్నాయని, దీంతో భవిష్యత్‌లో బంగారం ధర భారీగా పెరగొచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం భవిష్యత్‌లో ఔన్స్‌కు 2,500 నుంచి 3,000 డాలర్ల స్థాయికి చేరొచ్చని తెలిపారు. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 1,500 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది.ఈ నేపథ్యంలో కేవలం ఈక్విటీ మార్కెట్లలోనే కాకుండా బంగారంపై కూడా ఇన్వెస్ట్ చేస్తానని ఝన్‌ఝన్‌వాలా తెలిపారు. ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన బంగారంపై తన అభిప్రాయాలు వెల్లడించారు.ఇకపోతే దేశీ మార్కెట్ విషయానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరుగుదలతో రూ.39,670కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. రూ.36,360 వద్దనే నిలకడగా ఉంది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.46,000కు చేరింది.





Untitled Document
Advertisements