ఇటువైపు కూడా కాస్త దృష్టి పెట్టండి

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 04:20 PM

ప్రధాని ఏ పని మొదలు పెట్టిన దానిని సక్సెస్ చేసే వరకు నిద్రపోడు. ఆ విషయం అందరికి తెలిసిందే. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని అంగరంగ వైభాగంగా నిర్వహించడమే కాకుండా.. 150 వ జయంతికి ఒక గుర్తింపు తీసుకురావాలని అనుకున్నారు. ప్రపంచంలో ఈ ఏడాది అందరికి గుర్తుండిపోయే విధంగా ఏదో ఒకటి చేయాలని భావించారు. పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అక్టోబర్ 2 నుంచి నిషేదిస్తున్నట్టు ప్రకటించారు. దీనిని అనేకమంది మద్దతు ప్రకటించారు. బాలీవుడ్ స్టార్స్ కూడా దానికి మద్దతు తెలపడంతో.. వారిని ప్రత్యేకంగా కలిసి వారితో మీటింగ్ పెట్టి దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే నిన్నటి రోజున మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు బాలీవుడ్ కు చెందిన బిగ్ స్టార్స్ అందరు హాజరయ్యారు. కాగా, మోడీజీ బాలీవుడ్ పై మాత్రమే దృష్టిపెడుతున్నారని, సౌత్ ఇండస్ట్రీ వైపు కూడా కాస్త చూడాలని రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసింది. మోడీజీని అభిమానించే వ్యక్తులు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారని, ఇటువైపు కూడా కాస్త దృష్టి పెట్టాలని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నది. ఈ ట్వీట్ కు సౌత్ నుంచి మద్దతు లభిస్తుండటంతో వైరల్ అయ్యింది.





Untitled Document
Advertisements