ర్యాంప్ వాక్ చేస్తూ విద్యార్థిని మృతి

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 08:46 PM

ర్యాంప్ వాక్ చేస్తూ విద్యార్థిని మృతి

కాలేజీలో ర్యాంప్ వాక్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఫ్రెషర్స్‌ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు ర్యాంప్ వాక్‌ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని పారిశ్రామిక ప్రాంతం పీన్యాలోని ఓ ఎంబీఏ కాలేజీలో శుక్రవారం (అక్టోబర్ 18) ఈ ఘటన చోటు చేసుకుంది.షాలినీ (21) అనే యువతి పీన్యాలోని ఎంబీఏ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో జరగనున్న ప్రెషర్స్ డే ఉత్సవాల కోసం విద్యార్థులు సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో షాలినీ ర్యాంప్ వాక్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. తన వంతు రాగానే ర్యాంప్ వాక్ చేసిన అమ్మాయి.. అనంతరం స్టేజీకి ఓ పక్కన వెళ్లి నిల్చొంది. తర్వాతి అమ్మాయి ర్యాంప్ వాక్ చేస్తుండగా.. షాలినీ ఒక్కసారిగా కుప్పకూలింది.స్టేజీ పక్కన కుప్పకూలిన షాలినీని తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షాలినీ గుండెపోటు కారణంగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షాలినీ మృతితో ఆమె కుటుంబం, కాలేజీలో విషాద ఛాయలు అలుముకున్నాయి..





Untitled Document
Advertisements