లొంగిపోయిన 28 మంది నక్సలైట్స్

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 10:58 PM

లొంగిపోయిన 28 మంది నక్సలైట్స్

ఛత్తీస్‌గర్‌లోని దంతెవాడ జిల్లా, చిక్‌పల్ ప్రాంతంలో 28 మంది నక్సలైట్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఒక నక్సలైట్ ఆచూకీ తెలిపితే 2 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ఇదివరకే ప్రకటించారు. మరో ముగ్గురు నక్సలైట్స్ ఆచూకిపై ఒక్కో లక్ష రివార్డు ఉంది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నక్సలైట్స్ వారంతట వారు లొంగిపోవడం సంతోషదాయకం. వారిపై తీసుకొనే చర్యలు త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. జనజీవన స్రవంతిలో ఉండి తమ లక్ష్యాలు సాధించుకోవాలనీ, అజ్ఞాతంలో ఉండి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఏమొస్తుందని పోలీసులకు వారికి హితబోధ చేశారు. ప్రజా ప్రతినిధులను చంపడమే పరమావధిగా మీరు బతుకుతున్నారు. ఇలాంటి ఆలోచనలు పూర్తిగా మానుకోవాలనీ.. మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకెళ్లాలని పోలీసులు ఈ సందర్భంగా నక్సల్స్‌కు సూచించారు.





Untitled Document
Advertisements