రెండో రోజు తగ్గిన పసిడి ధర...వెండి ధర మాత్రం!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 07:10 PM

రెండో రోజు తగ్గిన పసిడి ధర...వెండి ధర మాత్రం!

బంగారం ధర మరింత కిందకు దిగజారింది. మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,950కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.36,620కు క్షీణించింది. పసిడి ధర ధర తగ్గితే.. వెండి ధర మాత్రం ఉన్నచోటునే స్థిరంగా కొనసాగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,000 వద్దనే నిలకడగా ఉంది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర రూ.50 చొప్పున దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.38,600కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.37,400కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే కొనసాగితే.. కేజీ వెండి ధర మాత్రం నిలకడగానే ఉంది. దీంతో ధర రూ.48,000 వద్ద స్థిరంగానే కొనసాగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్‌కు 0.10 శాతం తగ్గుదలతో 1,486.20 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.43 శాతం క్షీణతతో 17.50 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements