భారత్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐపీఎల్ ను వచ్చే సీజన్ నుంచి సరికొత్తగా నిర్వహించాలని బీసీసీఐ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటివరకు వీకెండ్ రోజుల్లో రెండేసి మ్యాచ్ లు నిర్వహించేవారు. ఇకమీదట ప్రతి రోజూ ఒకే మ్యాచ్, అది కూడా రాత్రివేళల్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ విధంగా ఐపీఎల్ నిడివి కూడా రెండు నెలలకు పొడిగించాలన్నది ఓ ప్రతిపాదన. త్వరలోనే జరిగే బీసీసీఐ పాలకమండలి సమావేశంలో తాజా ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు.