దరిద్రానికి ప్యాంటు,షర్టు వేస్తే మీలా ఉంటుంది విజయ సాయి రెడ్డి గారు

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 04:56 PM

తెలుగుదేశం నేత బుద్ద వెంకన్న మరోసారి ప్రభుత్వం పై మండిపడ్డారు. తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "దరిద్రానికి ప్యాంటు,షర్టు వేస్తే మీలా ఉంటుంది విజయ సాయి రెడ్డి గారు. ఇక మీ తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడరని కొత్తగా చెప్పక్కర్లేదు. అడుగుపెట్టాకా రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసా రెడ్డిగారు. బోట్ ముంచి 56 మంది అమాయకులని మింగేసారు, 256 రైతుల్ని మింగేసారు." అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

"విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారం చేసారు, 30 లక్షలమంది భవననిర్మాణ కార్మికులని రోడ్లపై నిలబెట్టారు. డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు, అన్నక్యాంటీన్ మూసేసి పేద వాడి పొట్ట కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డిఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు సాయి రెడ్డి గారు.. మీవాడు ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడన్నావ్. కానీ మీవాడు రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు దమ్ముంటే తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ తో రాజీనామా చేయించి రాష్ట్రంలో ఎక్కడనుంచైనా పోటీ చేయించు, తేలిపోతుంది ప్రజలు ఎవరిని తిరిగి కోరుకుంటున్నారో.. అంటూ రాసుకొచ్చారు బుద్ద వెంకన్న





Untitled Document
Advertisements