మోడీని చంపేస్తానంటూ సింగర్ వార్నింగ్..

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 05:23 PM

భారత ప్రధాని నరేంద్రమోడీ పై పాకిస్థాన్ సింగర్ రబీ పిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోడీని చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఒక పోస్టును పెట్టింది. సూసైడ్ బాంబ్స్ జాకెట్ ను ధరించిన ఫొటో పోస్ట్ చేసింది. నాకు నిన్ను చంపేయాలని ఉంది అంటూ ట్వీట్ చేసింది. దీనికి హిట్లర్ మోడీ అని యాష్ ట్యాగ్ ను జోడించింది. ఇప్పుడు ఈ సింగర్ చేసిన పోస్ట్ పై ఇండియన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ పోస్ట్ కు సమాధానంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పాకిస్థాన్ సింగర్ ఇలా మోడీ ని బెదిరించడం ఇది మొదటి సారికాదు.

గతంలోను మోడీ పై నోరుపారేసుకుంది రబీ. కశ్మీరీ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు నిన్ను ఎన్ని సార్లయినా చంపేందుకు నేను సిద్దంగా ఉన్నాను. నీవు చావడానికి సిద్దంగా ఉండూ అంటూ ట్వీట్ చేసింది. నేను పెంచుకునే నా స్నేహితులు(పాములు, మొసళ్ళు ) నిన్ను వింధు బోజనంగా చేసేందుకు ఎదురు చూస్తున్నారు. అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.





Untitled Document
Advertisements