పాకిస్తానీ గాయని-నటి రబీ పిర్జాదా మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ చంపేస్తానంటూ బెదిరించింది. గత నెలలో ఒక వీడియో పోస్ట్ ద్వారా పాములు, మొసళ్లతో ప్రధాని మోడీని చంపేస్తానంటూ బెదిరించిన పిర్జాదా ఇప్పుడు బాంబులతో కూడిన జాకెట్ని ధరించిన ఫోజుతో మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో తన ఫోటోను పోస్ట్ చేసి మోడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చింది. తనను తాను కశ్మీరీ ముద్దు బిడ్డగా అభివర్ణించుకున్న పిర్జాదా ఆత్మాహుతి బాంబు దాడితో మోడీని హతమారుస్తానంటూ బెదిరించింది. అయితే పిర్జాదా పోస్ట్కు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. కొందరు పాకిస్తానీ నెటిజన్లు కూడా పాకిస్తాన్ను అప్రతిష్ట పాల్జేసే విధంగా ఉన్న ఈ పోస్ట్పై పిర్జాదాను తిట్టిపోశారు. ఆగస్టు 17న కశ్మీరీ సమస్యపై పిర్జాదా ఒక పాటను విడుదల చేసింది. ఆ సందర్భంగా ట్వీట్ చేస్తూ కశ్మీరీలైన తాము పాకిస్తాన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తామని ఆమె చెప్పుకొచ్చింది.