డిపాజిట్లు కూడా దక్కించుకోలేని వాడు వచ్చి అడిగితే జగన్ సమాధానం చెప్తాడా... ?

     Written by : smtv Desk | Sun, Nov 17, 2019, 10:50 AM

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై కోడలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకొని ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని త్వరలో ఆ పార్టీ మునిగిపోతుందని నాని అన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు అని అలాంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి పైకి వచ్చిన నువ్వు మా గుంచి మాట్లాడుతున్నావా అని ప్రశ్నించారు.చంద్రబాబు పిల్లను ఇచ్చిన మామను చంపితే,దేవినేని ఉమా సొంత వదినను చంపాడని నాని విమర్శించారు. చంద్రబాబు మాటలు నమ్మి అవినాష్ మోసపోయాడు. దేవినేని నెహ్రు ఎన్టీఆర్ చివరి శ్వాస వరకు ఆయనతో ఉన్నారు. నెహ్రు చివరి రోజుల్లో కొడుకుకు రాజకీయ భవిషత్తు ఇవ్వమని నెహ్రు బాబును కోరారు. కానీ బాబు అవినాష్ ను పురుగులా చూసాడు అని నాని అన్నారు.


పైనున్నటువంటి ఎన్టీఆర్, నెహ్రు, రాజశేఖరెడ్డి అవినాష్ కు జ్ఞానోదయం చేసి జగన్ దగ్గరకు పంపారని నాని అన్నారు.టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన వారి పై ఒక్కరు కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే కేంద్రం కేసులు పెట్టిదని తెలుగుదేశం నాయకులకు భయం. చంద్రబాబు పాట్నర్ పవన్ కళ్యాణ్ కులాల గురించి, మతాల గురించి మాట్లాడాను అని చెప్పి ఎక్కువగా మాట్లాడేది ఆయనే ఈ రాష్ట్రం లో అని నాని అన్నారు. పార్టీ పెట్టి డిపాజిట్లు కూడా దక్కించుకోలేని వాడు వచ్చి అడిగితే జగన్ సమాధానం చెప్తాడా... ? అని కోడలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఇసకదీక్ష కు ఆ పార్టీ ఎమ్మెల్యే లే రాలేదు. పైగా సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. ఇసక.ఇంగ్లీష్ తప్ప జగన్ పైన ఆరోపణలు చెయ్యడానికి ఎం లేదు అని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఎం పేరు పెట్టాలో ఆయన పార్టీ నాయకులంతా కలిసి కూర్చొని డిసైడ్ అవ్వాలని నాని వ్యాఖ్యానించారు. జగన్ చిటికేస్తే తెలుగుదేశం పార్టీ ని తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పెడతాం అని నాని అన్నారు.





Untitled Document
Advertisements