డాక్టర్ నని అమాయక మహిళలు, యువతులను నమ్మించి వారితో లైంగిక వాంచలు తీర్చుకొని వేధింపులకు పాల్పడిన కంచరపాలేనికి అజిత్కుమార్ లీలలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. శనివారం అతడిని మీడియా ఎదుట హాజరుపరిచిన పోలీసులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. అజిత్ వలలో పడి సుమారు 20-30 మంది వరకు మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.ఏడాదిన్నర కిందట విశాఖ వేపగుంట ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల మహిళ తమ బంధువులను పరామర్శించేందుకు కేర్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ చెందిన కారు డ్రైవర్ అజిత్ కుమార్ డాక్టర్నంటూ పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ కాల్ చేసేవాడు. హెల్త్ టిప్స్ పేరుతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమె వ్యక్తిగత వివరాలను సేకరించాడు. తాను భర్త నుంచి విడాకులు తీసుకుని, కుమార్తెతో కలిసి ఉంటున్నట్లు అతడికి చెప్పింది.తన తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారని, తాను వైజాగ్లో డాక్టర్గా పనిచేస్తున్నానని కుమార్ ఆమెను నమ్మించాడు. తనకింకా పెళ్లి కాలేదని, ఒప్పుకుంటే ఇద్దరం వివాహం చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. ఆమె సరేనని చెప్పడంతో కొద్దిరోజులు శారీరకంగా అనుభవించాడు. ఓ రోజు రుషికొండ వైపు తీసుకెళ్లి కారులోనే ఆమెతో సెక్స్ చేశాడు. ఆ సమయంలో తన ఫ్రెండ్ మణికంఠతో బాధితురాలికి తెలియకుండా ఫోటోలు తీయించాడు. కొద్దిరోజుల తర్వాత వాటిని మహిళకు పంపించి వేరే వ్యక్తి పేరుతో బెదిరించాడు. అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే వాటిని సోషల్మీడియో పోస్టు్ చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె రూ.లక్షలు అతడికి సమర్పించుకుంది. ఈ ఘటన తర్వాత కుమార్ తనను దూరం పెట్టడంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజిత్కుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతడి బారిన పడి సుమారు 20-30 మంది మహిళలు మోసపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పరువు పోతుందన్న భయంతో ఎవరూ అతడిపై ఫిర్యాదు చేయలేదని, చివరికి ఓ బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడంతో అతడి ఆట కట్టించామని పోలీసులు చెబుతున్నారు. కారు డ్రైవర్ అయిన అజిత్ కుమార్ కంచరపాలెంలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడని, తాను డాక్టర్నంటూ అనేక మంది మహిళలను లోబరుచుకున్నాడని పోలీసులు తెలిపారు. మార్నింగ్ బీచ్ రోడ్డు ప్రాంతంలో నడిచే వాకర్స్ను టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకునేవాడు. లావుగా ఉన్నారని, డైట్ అవసరమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళతో ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అవుతాడు. వారితో సాన్నిహిత్యం పెంచుకుని శారీరకంగా లోబర్చుకుని వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలతో బెదిరించి డబ్బు, నగలు దోచుకునేవాడు.అజిత్కుమార్పై వచ్చిన ఫిర్యాదుపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేశామని వైజాగ్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. తనకు పరిచయమైన మహిళలను లోబరుచుకుని, ఫోటోలతో వాళ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని వెల్లడించారు. కుమార్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు.