భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ఐక్యతకు, భిన్నత్వానికి, సౌందర్యానికి రాజ్యాంగం ప్రతీకగా పేర్కొన్నారాయన. పాలకులకు కొత్త శక్తిని ఇస్తుందని ప్రధాని చెప్పారు. పాలక పక్షంగా తమకు ఈ సమావేశాలు కీలకమని తెలిపారు మోడీ.