ఈ స్కీమ్స్‌‌తో ప్రతి నెలా ఆదాయం!

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 01:18 PM

ఈ స్కీమ్స్‌‌తో ప్రతి నెలా ఆదాయం!

పదవీ విరమణ చేసిన తర్వాత డబ్బు సంపాదన దాదాపు ఉండకపోవచ్చు. అయితే ప్రతి నెలా కచ్చితంగా కొంత డబ్బు అవసరం అవుతుంది. దీని కోసం కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్రతి నెలా స్థిర ఆదాయం కోరుకునే వారికి ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వయ వందన యోజన పేరుతో ఒక స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ 2020 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో చేరడం వల్ల సంవత్సరానికి 8 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. ఉదాహరణకు మీరు 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా రూ.2,000 డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ లాకిన్ పీరియడ్ పదేళ్లు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌పై ఇప్పుడు 8.6 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు కూడా మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ప్రతి నెలా ఆదాయం పొందాలని భావించే వారు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ స్కీమ్ కాల పరిమితి ఐదేళ్లు. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. స్కీమ్‌లో పెట్టిన డబ్బులు ముందుగా కూడా తీసుకోవచ్చు. అయితే పెనాల్టలు పడతాయి.









Untitled Document
Advertisements