ఎస్‌‌బీఐలో లోన్ తీసుకుంటే రూ.2 లక్షలు ఆదా!

     Written by : smtv Desk | Tue, Dec 10, 2019, 10:04 AM

ఎస్‌‌బీఐలో లోన్ తీసుకుంటే రూ.2 లక్షలు ఆదా!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) తన కస్టమర్లకు తీపికబురు అందించింది. హోమ్ లోన్స్‌పై ఈఎంఐ చెల్లించే వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ తాజాగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ప్రత్యక్షంగానే రుణ గ్రహీతలకు ప్రయోజనం కలుగనుంది. రేట్ల తగ్గింపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. 2019 డిసెంబర్ 10 నుంచి ఏడాది ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయిన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 7.9 శాతానికి దిగిరానుంది. దీంతో ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమైన లోన్ తీసుకున్న వారికి లాభం కలుగనుంది. ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో లోన్ తీసుకున్న వారు ఈఎంఐ భారం తగ్గనుంది. వడ్డీ భారం తగ్గనుంది. గతేడాది డిసెంబర్ నెలలో ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ 8.5 శాతంగా ఉంది. ఇప్పుడు ఈ ఎంసీఎల్ఆర్ ఏకంగా 7.9 శాతానికి దిగివచ్చింది. దాదాపు 60 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ తగ్గింది. ఎస్‌బీఐ అందించే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు పలు అంశాల ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. లోన్ అమౌంట్, క్రెడిట్ స్కోర్, రుణ గ్రహీత వంటి పలు అంశాలు వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి. డిసెంబర్ నెలలో లోన్ రీసెట్ డేట్ ఉన్న వారికి ఎంసీఎల్ఆర్ తగ్గింపు నిర్ణయంతో కలిగే ప్రయోజనం వెంటనే లభిస్తుంది. ఎంసీఎల్ఆర్ లోన్స్‌కు రీసెట్ పీరియడ్ 12 నెలలుగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ తన హోమ్ లోన్ వడ్డీ రేట్లు తాజా ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన సవరిస్తుంది. దీంతో ఇప్పుడు వడ్డీ రేటు దిగిరానుంది. ఏడాది కాలంలో ఎంసీఎల్ఆర్ రేటు 0.6 శాతం దిగొచ్చింది. దీని వల్ల హోమ్ లోన్ వడ్డీ రేటుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు రూ.30 లక్షల లోన్ తీసుకున్నారు. కాల పరిమితి 15 ఏళ్లు. అప్పుడు ఈఎంఐ భారం రూ.1,045 తగ్గుతుంది. అంటే సంవత్సరానికి రూ.12,542 ఆదా అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఏడాది కాలంలో 0.6 శాతం దిగిరావడంతో ఈఎంఐ భారం రూ.1,000కు పైగా తగ్గుతుంది. అదేసమయంలో వడ్డీ రూపంలో మొత్తంగా రూ.1.90 లక్షల వరకు ఆదా అవుతుంది. దీంతో లోన్ తీసుకున్న వారు మొత్తంగా రూ.2 లక్షలకు పైగా ఆదా చేసుకోవచ్చు. ఎంసీఎల్ఆర్ తగ్గింపు నేపథ్యంలో బ్యాంక్ లోన్ తీసుకున్న వారకి రెండు ఆప్షన్లు ఇచ్చే అవకాశముంది. ఒకటేమో ఈఎంఐ భారాన్ని తగ్గించడం. లేదంటే లోన్ కాల పరిమితిని కుదించడం. ఈ రెండు మార్గాల్లో తగ్గించిన ఎంసీఎల్ఆర్ ప్రయోజనాన్ని బ్యాంక్ కస్టమర్లకు బదిలీ చేస్తుంది. స్టేట్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారు ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలను ఆర్ఎల్ఎల్ఆర్ విధానానికి మార్చుకోవచ్చు. బ్యాంక్ హోమ్ లోన్ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందిస్తోంది. 2019 అక్టోబర్ 1 నుంచి బ్యాంక్ ఆర్‌బీఐ రెపో రేటు బెంచ్‌మార్క్‌తో లింక్ అయిన హోమ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంసీఎల్ఆర్ రుణాలు తీసుకున్న వారు ఆర్ఎల్ఎల్ఆర్‌కు మారడం ఉత్తమం. ఆర్ఎల్ఎల్ఆర్ తరహా రుణాల్లో ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే ఆ ప్రయోజనం రుణ రేట్లపై కనిపిస్తుంది. ఆటోమేటిక్‌గానే రుణ రేట్లు కూడా మారతాయి. దీంతో కస్టమర్లపై నేరుగానే ప్రభావం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు వివిధ రకాల హోమ్ లోన్స్‌ను అందిస్తోంది. రెగ్యులర్ హోమ్ లోన్స్, ఫ్లెక్సీపే హోమ్ లోన్, ప్రవివేజ్ హోమ్ లోన్, శౌర్య హోమ్ లోన్, ప్రిఅప్రూవ్డ్ హోమ్ లోన్, రియల్టీ హోమ్ లోన్, బ్రిడ్జ్ హోమ్ లోన్ వంటి రుణాలను ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఎస్‌బీఐ హోమ్ లోన్స్, ఆటో లోన్స్ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. బ్యాంక్ ఈ రెండు విభాగాల్లో దాదాపు 25 శాతం చొప్పున మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2019 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ డిపాజిట్ బేస్ రూ.30 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్రాంచ్‌లు, ఏటీఎంలు, కస్టమర్ల పరంగా చూస్తే ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది.


















Untitled Document
Advertisements