ట్విట్టర్‌లోనూ నం.1

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 07:03 AM

సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపేందుకు, తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం, వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునేందుకు అనేక తారలు, అథ్లెట్లు ట్విట్టర్ ను వాడుతారు. అయితే 2019 పూర్తి కావస్తోన్న తరుణంలో తాజాగా ట్విట్టర్ ఇండియా వివిధ అంశాల్లో అత్యంత ఆదరణ కలిగిన ట్విట్టర్ హ్యాండిల్స్‌ జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రీడలకు సంబంధించిన జాబితాను కూడా ప్రకటించింది. అయితే క్రికెటర్లు ఈ జాబితాను క్లీన్ స్వీప్ చేశారు. టాప్-10లో మొత్తం వీరే నిండిపోయారు. అయితే క్రికెట్‌లో రోజురోజుకు తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో నం.1గా నిలిచాడు. అయితే ఈ జాబితాను ప్రకటించడానికి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది. అత్యధిక ట్వీట్లు చేయడం, రీట్వీట్ కావడం. మోస్ట్ లైకులు ఇలా పలు అంశాలను బేరీజు వేసి ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో వరుసగా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా టాప్-10లో నిలిచారు. మహిళల కేటగిరీలో తెలుగు షట్లర్, భారత నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచాక సింధు క్రేజు అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమెకు చాలా క్రేజ్ వచ్చింది. అలాగే ఆమె తర్వాత స్థానంలో సంచనల యువ అథ్లెట్ హిమ దాస్ నిలిచింది. ఇటీవల పలు టోర్నీలలో బంగారు పతకాలు సాధించిన హిమను కూడా సోషల్ మీడియాలో చాలా ఫాలో అవుతున్నారు. సానియా మీర్జా (టెన్నిస్), సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), మిథాలీ రాజ్(క్రికెట్), మేరీ కోమ్ (బాక్సింగ్), స్తృతి మందనా (క్రికెట్), ద్యుతీ చంద్(అథ్లెటిక్స్), మానసి నయన జోషి(పారా బ్యాడ్మింటన్), రాణి రాంపాల్ (హాకీ) నిలిచారు. ఇక క్రీడాప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడా సంబంధమైన ట్వీట్‌గా విరాట్ కోహ్లీ చేసిన పోస్టు నిలిచింది. ఈ ఏడాది మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్‌డే సందర్భంగా కోహ్లీ చేసిన ట్వీట్ వైరల్‌‌గా మారింది. దీన్ని ఏకంగా 45వేల మంది రీట్వీట్ చేశారు. నలభై లక్షలమందికిపైగా నెటిజన్లు లైక్ చేశారు. అలాగే భారత్‌లో ఈ ఏడాది అత్యధికంగా చర్చించబడిన ట్వీట్‌గా నిలిచింది.







Untitled Document
Advertisements