శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్కు రానున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 28 వరకు హైదరాబాద్లోని రాష్ట్రపతి భవన్లో ఉంటారు. ప్రతి శీతాకాలంలో జరిపే సదరన్ సోజోర్న్ టూర్లో భాగంగా బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బస చేయనున్నారు. అయితే మధ్యలో నాలుగు రోజులపాటు అంటే ఈనెల 22 నుంచి 26 వరకు రాష్ట్రపతి కేరళ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. 26వ తేదీన కొచ్చి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు చెబుతున్నారు. అనంతరం 28వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్ కోవింది ఢిల్లీకి బయలుదేరుతారు. కాగా, రాష్ట్రపతి కోవింద హైదరాబాద్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా అందనున్నాయి. అయితే తుది వివరాలు చేరే సమయానికి రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.