అత్యంత చవకైన ప్లాన్ ను తొలగించిన జియో!

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 12:53 PM

అత్యంత చవకైన ప్లాన్ ను తొలగించిన జియో!

రిలయన్స్ జియో తన ప్లాన్లను సవరించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అత్యంత చవకైన ప్లాన్ రూ.49 ప్లాన్ ను తొలగించింది. దీంతో ఇప్పుడు జియో ఫోన్ ప్లాన్లలో అత్యంత చవకైన ప్లాన్ రూ.75 ప్లాన్ గా మారింది.కొన్ని వారాల క్రితం జియో ప్రవేశపెట్టిన ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో ఈ రూ.75 ప్లాన్ కూడా ఒకటి. వివిధ లాభాలతో రూ.75, రూ.125, రూ.155, రూ.185 ప్లాన్లను జియో ప్రవేశపెట్టింది. అయితే జియో ఫోన్ ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ఈ రూ.49 ప్లాన్ నే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే నెల మొత్తం ఉచితంగా ఏ నెట్ వర్క్ కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 1 జీబీ డేటా లభిస్తుంది. అయితే జియో ఐయూసీ చార్జీలను తీసుకువచ్చిన అనంతరం వీరు కూడా వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవాలంటే అదనపు చార్జీలను చెల్లించాల్సి వస్తోంది.ఐయూసీ చార్జీలను తీసుకురావడం, టారిఫ్ లను పెంచడంతో ఇప్పటికే జియో మార్కెట్లో గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోంది. దానికి తోడు ఇప్పుడు ఈ రూ.49 ప్లాన్ ను తొలగించడం వినియోగదారులకు జియోపై మరింత వ్యతిరేకతను పెంచుతుంది. అయితే ఇంతకుముందు ప్లాన్లు అయిన రూ.99, రూ.153, రూ.297, రూ.594 వంటి రీచార్జ్ ప్లాన్లు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ వీటితో రీచార్జ్ చేసుకున్నప్పటికీ వినియోగదారులు వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి ఐయూసీ రీచార్జ్ చేసుకోక తప్పదు.జియో రూ.99 ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే.. రోజుకు 0.5 జీబీ డేటాను అందించనున్నారు. అలాగే మొత్తంగా 300 ఎస్ఎంఎస్ లు అందిస్తారు. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రూ.75 ఆల్ ఇన్ వన్ ప్యాక్ తో రీచార్జ్ చేసుకుంటే 3 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలను అందిస్తారు. మొత్తంగా 50 ఎస్ఎంఎస్ లను అందిస్తారు. ప్రస్తుతం జియో ఫోన్ కు కూడా రూ.100లోపు అందుబాటులో ఉన్న ప్లాన్లు ఇవి మాత్రమే!







Untitled Document
Advertisements