విండీస్ తో నేడు జరిగే మూడో టెస్ట్ కి కోహ్లీ సేన కొత్త ఓపెనర్ ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. వెస్టిండీస్తో వన్డేసిరీస్కు గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యే అవకాశముంది. నిజానికి సెలెక్షన్ కమిటీతో మయాంక్తోపాటు పథ్వీషా, శుభ్మాన్ గిల్ పేర్లను పరిశీలించిన టీమ్మేనేజ్మెంట్ మయాంక్కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విండీస్ మూడు టీ20ల సిరీస్ ఆడుతున్న భారతజట్టు సిరీస్ ముగిశాక మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఈనెల 15 నుంచి చెన్నైలో జరిగే తొలి మ్యాచ్ ద్వారా ప్రారంభమవుతుంది. అనంతరం 18న విశాఖపట్నంలో రెండో వన్డే, 22న కటక్లో మూడో మ్యాచ్ జరుగుతాయి. ఇక సిసలైన టెస్టు ఓపెనర్గా ముద్రపడిన మయాంక్ను వన్డేలకు తీసుకోడానికి టీమ్ మేనేజ్మెంట్ చెప్పిన కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దేశవాలీ లిస్ట్-ఏ మ్యాచ్ల్లో మయాంక్ అగర్వాల్ ఆటతీరు బాగుండటమే ఇందుకు కారణమని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ ఫార్మాట్లో 79 మ్యాచ్లాడిన ఈ కర్ణాటక ప్లేయర్ 50.90 సగటుతో 3,869 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేటు కూడా 101కిపైగా నమోదు కావడం విశేషం. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్ మయాంక్ను కూడా పరిశీలించాలని భావిస్తోంది. ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ధవన్.. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరిలోకి దిగాడు. అయితే అక్కడ మోకాలికి గాయం కావడంతో టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ఆ తర్వాత వివిధ పరీక్షల్లో అతనికి అయిన గాయం తీవ్రమైనదని తేలడం కొంతకాలంపాటు అంతర్జాతీయ క్రికెట్కు తను దూరంగా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న ధవన్.. వన్డే సిరీస్ నుంచి దాదాపుగా వైదొలగడం ఖాయంగా మారింది.