లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 170 పాయింట్లు పైకి

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 170 పాయింట్లు పైకి

బుధవారం దేశీయ స్టాక్ మార్కేల్టు కాస్త లాభాల్లో ముగిసాయి. పడిపోయిన బెంచ్‌‌‌మార్క్ సూచీలు లాభాల బాటపట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్ల ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇండెక్స్‌లు రోజంతా రేంజ్‌బౌండ్‌లోనే కదలాడాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నం కల్లా నష్టాల్లోకి జారుకుంది. అయితే చివరి గంటలో ఐటీ, పవర్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మళ్లీ సూచీలు లాభాల్లోకి వచ్చేశాయి. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 40,413 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 11,910 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 50లో గెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌టీపీసీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ షేరు 5 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ 50లో గెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌టీపీసీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ షేరు 5 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా పరుగులు పెట్టింది.





Untitled Document
Advertisements