ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 07:08 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు!

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి, పాలన ఏడాది పూర్తి చేసుకున్నందుకు జగ్గారెడ్డి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండి మంచి పాలన అందిస్తారని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఓవైపు ముఖ్యమంత్రిని అభినందిస్తూనే మరోవైపు, ఆయన పాలన పట్ల జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ‘‘హామీల్లో భాగంగా రాష్ట్రంలో అవినీతి ఉండదన్నారు. ప్రస్తుతం తెలంగాణ అవినీతి రహిత రాష్ట్రంగా ఉందా మరి?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అక్షరాస్యత విషయంలో తెలంగాణ దేశంలో అట్టడుగు స్థానంలో ఉండడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. పేద వారికి ఉచిత వైద్య చికిత్స ప్రసాదించే సంక్షేమ పథకం.. ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోయిన పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారిందని అన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సొంత భవనం కూడా కట్టలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులే లేవని, ఇలా అయితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.






Untitled Document
Advertisements