ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్...సెన్సెక్స్ స్వల్పంగా పైకి

     Written by : smtv Desk | Fri, Jan 17, 2020, 04:29 PM

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్...సెన్సెక్స్ స్వల్పంగా పైకి

శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు స్థిరంగానే క్లోజయ్యాయి. సెన్సెక్స్ స్వల్పంగా పైకి కదిలితే.. నిఫ్టీ మాత్రం స్వల్పంగా కిందకు దిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్‌టెల్, మారుతీ, హెచ్‌యూఎల్ షేర్లలో లాభాలు.. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐసీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఎస్‌బీఐ షేర్లలో నష్టాలు కలిసి మార్కెట్‌ ఉన్నచోటునే ఉండిపోయింది.ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 42,064 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి కారణంగా సూచీ మళ్లీ వెనక్కి వచ్చేసింది. చివరకు సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 41,945 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 12,352 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే ఔట్‌పర్ఫార్మ్ కనబరిచాయి. నిఫ్టీ 50లో భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. ఎయిర్‌టెల్ దాదాపు 6 శాతం పెరిగింది. అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్, వేదాంత, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఏకంగా 11 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు నష్టపోయాయి. అదేసమయంలో నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 1 శాతానికి పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.68 శాతం పెరుగుదలతో 65.06 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.53 శాతం పెరుగుదలతో 58.83 డాలర్లకు ఎగసింది.





Untitled Document
Advertisements