TRSను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబానికి పాలేర్లైతరు!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 04:05 PM

TRSను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబానికి పాలేర్లైతరు!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. నిజామాబాద్లోని వర్ని రోడ్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కి గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లంతా కల్వకుంట్ల కుటుంబానికి పాలేర్లుగా మారతారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. టీఆర్ఎస్ ని గెలిపిస్తే ప్రజలను పట్టించుకోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే గూటి పక్షి అని అన్నారాయన. ఎంఐఎం పార్టీ వల్ల భైంసాలో హిందువులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని, అక్కడ జరిగిన ఘటన నిజామాబాద్ లో జరగకూడదని అన్నారు లక్ష్మణ్. అందుకే ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ కు ఓటేసినా అది ఎంఐఎంకి వేసినట్లేనని చెప్పారాయన. కేంద్రం ఇచ్చిన నిధులు తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. కానీ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. కేటీఆర్ తో ఈ విషయంపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements