ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ బాలిక కాలేజ్ హాస్టల్ లోనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన దంతేవాడ జిల్లా పతర్రాస్ ఏరియాలో చోటుచేసుకుంది. జిల్లా డిప్యూటి కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… బాలిక కొన్ని నెలల నుంచి గర్భంతో ఉన్నప్పటికి కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నందుకు హాస్టల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా బాధిత బాలిక తన స్వగ్రామానికి చెందిన ఓ అబ్బాయితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తను గర్భం దాల్చిన విషయం తన తల్లిదండ్రులకు తెలియదని బాలిక అధికారులకు తెలిపింది. శిశువును బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధితురాలితో పాటు ఆస్పత్రి సిబ్బందిని, తోటి విద్యార్థినులను విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.
Dy Collector: She was later brought to the hospital. We#39;ll question the medical staff too. Hostel Superintendent was immediately suspended, further action will be taken based on investigation. School admn handed over the stillborn child to girl#39;s parents who reached later.(18.01) https://t.co/W52l7UEJOu
mdash; ANI (@ANI) January 19, 2020