బెంగళూరులో ఆసిస్ -భారత్ మధ్య ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-1తో ఇండియా కైవసం చేసుకుంది. ఈక్రమంలో గతేడాది సొంతగడ్డపై తమను 3-2తో ఓడించిన కంగారూలకు దీటైన బదులిచ్చింది. ఈ సిరీస్లో ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ గెలవగా.. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో ఇండియా నెగ్గింది.అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 287 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (131, 132 బంతులు, 14 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈక్రమంలో నాలుగేళ్ల తర్వాత తొలి సెంచరీ సాధించాడు. మార్నస్ లబుషేన్ (54) ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో షమీ (4/63) సత్తాచాటాడు. రవీంద్ర జడేజా (2/44) ఆకట్టుకున్నాడు. నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్కు చెరో వికెట్ దక్కింది.ఓ మాదిరి టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ (119, 128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు)తో ఈ ఏడాది తొలి సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ (19)తో కలిసి 69 పరుగులు జోడించి గట్టి పునాది వేశాడు. రాహుల్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ (89, 91 బంతుల్లో 8 ఫోర్లు)-రోహిత్ ద్వయం కంగారూ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంది. వీరిద్దరూ రెండో వికెట్కు 137 పరుగులు జోడించి మ్యాచ్ను భారత వశం చేశారు. సెంచరీ పూర్తయ్యాక భారీ షాట్కు ఔటై రోహిత్ పెవిలియన్కు చేరాడు. ఈదశలో శ్రేయస్ అయ్యర్ ()తో కలిసి కోహ్లీ జట్టును దాదాపు విజయం ముంగిటకు చేర్చాడు. చివర్లో కోహ్లీ ఔటైనా.. మనీశ్ పాండే ()తో కలిసి శ్రేయస్ లాంఛనం పూర్తి చేశాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్వుడ్, అగర్, జంపాలకు తలో వికెట్ దక్కింది.