అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలించడానికి కేంద్రం ఆమోదం ఉందని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికార, ప్రతి పక్షాలు రెండు ఈ వదంతులను వ్యాపింపచేస్తున్నాయి అని ధ్వజమెత్తారు. అమరావతిని తరలించడాన్ని జగన్ ఏకపక్ష నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఈ క్రమములో బీజేపీ నాయకుడు సునీల్ దియోధర్ చేసిన ట్వీట్ ని జత చేసి పవన్ ఈ విషయాన్నీ వివరించే ప్రయత్నం చేసారు.
అమరావతి రాజధాని తరలింపు ఏకపక్ష నిర్ణయం అని, జగన్ ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపిన పవన్, తాము తీసుకుంటున్న మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక దానిపై కేంద్రం తో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రచారంలో ఈ రెండు పార్టీలు టీడీపీ, వైసీపీ రెండూ దొందూ దొందే అనే అన్నారు.