ప్రజలను మోసం చేసి సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 09:34 AM

ప్రజలను మోసం చేసి సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు పెట్టి మసిపూసి మారేడుకాయ చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోను తెరాస వెబ్‌సైట్‌ నుంచి తొలగించిందని.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రజలకు అందుబాటులో ఉంచామని పొన్నాల పేర్కొన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ వద్ద సమాధానం ఉన్నట్లయితే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.





Untitled Document
Advertisements